విశాఖపట్టణంలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని రుషికొండ ఐటీ పార్క్లోని హిల్-2లోని మహతి ఫిన్టెక్ భవనంలో ఏర్పాటు చేశారు. వెయ్యి సీటింగ్ కెపాసిటీతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.
8,000 మందికి ఉపాధి అవకాశాలు
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించాం.ఈ ప్రాజెక్ట్లో ప్రపంచ ప్రమాణాలను అనుసరించే ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపస్ను మూడు దశల్లో రూ. 1,583 కోట్లతో నిర్మించనున్నారు.ఈ భవనాల ద్వారా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు.ప్రథమ దశను 2029 నాటికి పూర్తి చేయడం ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.మొత్తం మూడు దశలను 2033 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టబడింది.


