Homeఆంధ్రప్రదేశ్అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఃమూడు రాజధానులః గందరగోళానికి శాశ్వతంగా తెరపడింది.ఏపీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఈ నూతన జిల్లాల సరిహద్దులతో కూడిన అధికారిక పటాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.కేంద్ర ప్రభుత్వం కూడా తన రికార్డుల్లో, భారత అధికారిక మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్‌డేట్ చేసింది. ఇది దేశవ్యాప్త పరిపాలన అవసరాలకు ప్రామాణికంగా నిలవనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు