గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలను ఘనంగా పాఠకులు, గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల పాలిట ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరంవేసవి శిక్షణ తరగతులలో భాగంగా మంచి నీతి కథలు చెప్పడం, పుస్తకాలను చదివించడం పిల్లలకు యోగా విన్యాసాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. చదువుతోపాటు యోగ, ఆటల విషయంలో మంచి మెలకువలను తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ శిక్షణ తరగతులకు 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలు
RELATED ARTICLES