Homeఅంతర్జాతీయం80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు

80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు

- Advertisement -

ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం దిగివచ్చాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పెట్టుబడిదారులు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్ల దిగువకు చేరింది. బ్యారెల్‌ ధర 0.72 శాతం తగ్గి 78.39 డాలర్లకు చేరింది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (డబ్ల్యూటీఐ) చమురు ధర దాదాపు 1 శాతం పడిపోయి 75.35 డాలర్లుగా నమోదైంది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో చమురు ధరలు దిగొచ్చాయి. మరోవైపు ఒప్పందంపై సంతకం అనంతరం ఇరాన్‌కు చమురు విక్రయాలపై అవకాశం కల్పిస్తామని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ వారం కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ఏప్రిల్‌లో ప్రకటించిన కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించారు. ఈ సమయంలో శాశ్వత శాంతి ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి.ఒప్పందంలో భాగంగా ఇరాన్‌ పోర్టులపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు సమాచారం. ప్రతిగా హర్మూజ్‌ జలసంధి మీదుగా చమురు ట్యాంకర్లు, ఇతర నౌకల రాకపోకలకు ఇరాన్‌ అనుమతి ఇవ్వనుంది.

చమురు ధరలు తగ్గడం భారత కరెన్సీకి కూడా మేలు చేసింది. బుధవారం రూపాయి విలువ 31 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 94.29 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో ఇది 94.56 వద్ద స్థిరపడింది. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) నిధుల ఉపసంహరణ కూడా క్రమంగా తగ్గుతోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడుతుండటం ఈ ధోరణికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు తగ్గడం, ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల రూపంలో భారత్‌కు భారీగా విదేశీ నిధులు వచ్చే అవకాశాలు ఉండటంతో రూపాయి మరింత బలపడవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు