Saturday, May 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి ఆపరేషన్ల ద్వారా పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

ఉచిత కంటి ఆపరేషన్ల ద్వారా పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

: రోటరీ క్లబ్
విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత కంటి వైద్య చికిత్సలతో పాటు ఆపరేషన్ల ద్వారా పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో మే 8వ తేదీన నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జూన్ 8వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా, ఉచిత వసతి తో పాటు కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిరమునకు దాతలుగా అన్నపూర్ణ రెడీ మిక్స్ కాంక్రీట్- అనంతపురం వారి దాతృత్వంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడినది తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునే వారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులతో ఏవైనా రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు, సెల్ నెంబర్ చిరునామాతో రావాల్సి ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, రత్నశేఖర్ రెడ్డి, కొండయ్య, పెద్దారెడ్డి, గట్టు హరినాథ్, కృష్ణమూర్తి, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు