విశాలాంధ్ర – గోపాలపురం : బిఫోర్ సర్వే పేదల పాలిట వరమని ఎంపీడీవో జి రాజు మనోహర్ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం మండల పరిధిలో 3445 కుటుంబాలను అతి పేద కుటుంబాలు గా(పి ఓ పి) గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ కుటుంబాల సమగ్ర అభివృద్ధికి మండల స్థాయి అధికారులు గ్రామ కార్యదర్శులు ను అనుసంధానం చేసి అభివృద్ధి వైపు ఆ కుటుంబాలను చేర్చేందుకు ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన యాప్ లో వారి వివరాలను పొందుపరచాలన్నారు. కార్పొరేట్ సంస్థలు గ్రామ స్థాయిలో కుటుంబాల అభివృద్ధికి సహకరించి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీడీవో సువర్చల, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బంగారయ్య పి.ఆర్ ఏఈ పవన్ కుమార్ ఏపిఎం రోజు మాణిక్యం ఏపీఓ రమణ కార్యదర్శి అనురాధ ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శిలు పాల్గొన్నారు.
పి ఫోర్ సర్వే పేదల పాలిట వరం
- Advertisement -
RELATED ARTICLES


