బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత భారత్ లో ప్రతి ఒకరు భాగస్వామ్యం కావాలని బిజెపి నాయకులు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్, పట్టణ అధ్యక్షుడు జింక చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షులు గొట్లూరు చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు,మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం పార్టీ కార్యాలయం లో కేంద్రం లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు అయిన సందర్బంగా చేపడుతున్న వికసిత భారతదేశపు అమృతకాలం సేవాస పరిపాలన పేదల సంక్షేమానికి సంక్షేమానికి 11 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా వికసితభారత్ 2047 ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చైతన్యవంతుడైన భారత పౌరుడిగా 2047 నాటికి వికసిత భారత్ కోసం పాటుపడాలని తెలిపారు. భారత దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఘనమైన వారసత్వాన్ని కొనసాగించాలని వారు కోరారు. అవినీతిరహిత వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలియజేశారు.మహిళల గౌరవ మర్యాదలు పెంచుతూ, వారి సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. దేశభక్తి గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేయాలని, దేశసేవే అత్యున్నత సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని తెలిపారు. అనంతరం వికసిత భారత్ 2047 కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తన, మన ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తామని బిజెపి నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ చేపడుతున్న పరిపాలనను స్ఫూర్తిగా తీసుకొని ధర్మవరం నియోజకవర్గాన్ని మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలియజేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర, చంద్రశేఖర్,పోతుకుంట రాజు, నబి రసూల్, వడ్డే శ్రీనివాసులు మహాలక్ష్మి, రాధమ్మ, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ,సోమ్లా నాయక్, గొట్లూరు అనిల్,శారదమ్మ,నాగభూషణ, మల్లికార్జున, చెన్నా ఆదినారాయణ,వేణు, మహేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ వికసిత భారత్ లో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి
RELATED ARTICLES