- Advertisement -
విశాలాంధ్ర – కడియం : కడియం శివాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో గోసాలకు, కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్ సుంకర సత్యనారాయణ శనివారం గోసంరక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గిరజాల బాబు చేతుల మీదుగా పుంగనూరి ఆవును బహుకరించారు. గోసాల కమిటీ సభ్యులు కుసునూరి బాబులు, పున్నమిరాజు వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


