Monday, June 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరజిని ట్రస్టు, రక్త బంధం ట్రస్టు సభ్యులకు రెడ్ క్రాస్ అవార్డు ప్రదానం

రజిని ట్రస్టు, రక్త బంధం ట్రస్టు సభ్యులకు రెడ్ క్రాస్ అవార్డు ప్రదానం

విశాలాంధ్ర -ధర్మవరం; ప్రపంచ రక్తదాతల దినోత్సవంను పురస్కరించుకొని అనంతపురం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో రక్తదాన సేవలు అందించిన వారికి అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కాపు భారతి ఆధ్వర్యంలో ఉత్తమ రక్తదాతలకు, రక్తదాన సేవలందించిన సామాజిక సేవకులకు జిల్లాస్థాయి అవార్డులను ప్రధాన ఉత్సవం చేయడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రజిని ట్రస్టు, రక్త బంధం ట్రస్టు అయినటువంటి ట్రస్ట్ సభ్యులు సమాజ సేవకులు కేతా లోకేష్, చిప్పల చంద్రశేఖర్, సనప కిరణ్ కుమార్, తరిమెల భాగ్యలక్ష్మి, లకు అనంతపురం రెవిన్యూ డివిజనల్ అధికారి గుత్తా కేశవ నాయుడు, చేతుల మీదుగా సమాజ సేవకులు కేతా లోకేష్, చిప్పల చంద్రశేఖర్, సనప కిరణ్ కుమార్, తరిమెల భాగ్యలక్ష్మి, అవార్డును ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, జిల్లాలో కూడా విస్తృతంగా రక్త దానాలు చేస్తున్న రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్టు సేవల గురించి వారు కొనియాడారు. అనంతరం అవార్డు అందుకున్న వారు మాట్లాడుతూ ఈ అవార్డు ప్రజలకే అంకితం అని, ఈ అవార్డు వల్ల మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. రక్తం యొక్క అవసరం అందరికీ ఉంటుందని, రక్త దానమును జీవనములో అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఒక రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని తెలిపారు. రక్త దానములో అపూహలు విడనాడాలని తెలిపారు. రక్త దానమును చేయించుటలో ప్రోత్సహించాల్సిన బాధ్యత నేటి యువతీ యువకులలో ఎంతో అవసరం ఉందని తెలిపారు. రక్తం అవసరమున్నప్పుడు రక్తదాతలు ఏ సమయంలోనైనా సరే రక్తదానం చేసినప్పుడే మానవతా విలువలకు మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. రక్తదానం విలువ కట్టాలేనిదని, కుల, మతాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. నేటి సమాజంలో రక్త దాతలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. రక్తదానంపై ప్రతి గ్రామంలో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు