సోమవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మిక మరణం
ప్రముఖ ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా గుర్తింపు
వ్యక్తిత్వ వికాస ప్రసంగాలతో తెలుగువారికి సుపరిచితులు
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన మాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన పట్టాభిరామ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బీవీ పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా, పేరుగాంచిన ఇంద్రజాలికుడిగా, మానసిక నిపుణుడిగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితులు. అనేక పుస్తకాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వేలాది ప్రసంగాల ద్వారా ఆయన సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. క్లిష్టమైన మానసిక శాస్త్ర అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సులభమైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకత.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
RELATED ARTICLES