తెదేపా నాయకులకు పరిటాల శ్రీరామ్ సూచన
వార్డుల వారిగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తెదేపా నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలో గత కొన్ని నెలలుగా పట్టణంలో గల వార్డులలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలుగుదేశంపార్టీ ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెదేపా నాయకులకు సూచించారు.ధర్మవరం పట్టణంలో పలు సమస్యలను వార్డు నాయకులు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిపించి వార్డుల వారీగా సమస్యలను గుర్తించి అధికారులు వెంట తీసుకువెళ్లి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన సూచించారు.అందులో భాగంగా విద్యుత్ శాఖ ఏడి , పట్టణ మున్సిపల్ కమిషన్ దృష్టికి వార్డులలో గల పలు సమస్యలను తీసుకువెళ్లగా తక్షణమే అధికారులు వార్డులలోకి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో గల 8,12,14,34 వార్డులలో విద్యుత్ శాఖకు సంబంధించిన కరెంటు పోల్స్ , కరెంటు తీగలు ఇంటిపై ఉండడం తదితర సమస్యలను విద్యుత్ శాఖ ఏడి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం వార్డులలో ఎక్కడికక్కడ చెత్త ఉండడంతో ప్రజలు సమస్యలను నాయకులు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే వార్డుల్లో చెత్త సేకరణ పూర్తి స్థాయిలో చేపట్టాలని తెదేపానాయకులు మున్సిపల్ కమిషనర్ను కోరారు. అదేవిధంగా పట్టణంలో గల పార్థసారధి నగర్ లో గత కొన్ని నెలలుగా మున్సిపల్ త్రాగునీరు కలుషితమై వస్తున్నందున వార్డులో గల ప్రజలు కలుషిత త్రాగునీరు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వార్డు తెదేపా నాయకులు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మున్సిపల్ కమిషనర్ మాట్లాడి సంబంధిత పైప్ లైన్ ను వెంటనే రిపేరు చేయాలని ఆయన మున్సిపల్ కమిషనర్ను కోరగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ తెదేపా నాయకులతో కలిసి పార్థసారథినగర్ కు వెళ్లి కలుషిత నీరుకు సంబంధించిన పైప్ లైన్లను పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులైనటువంటి ఇంజనీరింగ్ డిఇ వీరేష్,ఫిట్టర్ నాగరాజు ను పిలిపించి తక్షణమే కలుషిత నీటి పైప్ లైన్లు మార్చాలని మున్సిపల్ కమిషనర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో వార్డు ప్రజలు టిడిపి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.