Thursday, June 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ప్రజలే గమ్యం – ప్రతి అడుగూ ధర్మవరం అభివృద్ధి వైపు

ధర్మవరం ప్రజలే గమ్యం – ప్రతి అడుగూ ధర్మవరం అభివృద్ధి వైపు

మంత్రిగా పదవీ బాధ్యతలలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సత్యకుమార్ యాదవ్ పాదయాత్ర
విశాలాంధ్ర ధర్మవరం;ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గడిచిన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం పట్టణ ప్రజల మధ్యకు మరోసారి నడక మార్గంలో వస్తున్నారు అని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఈ నెల 4వ తేదీన ప్రారంభం కావలసిన పాదయాత్ర, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమం – అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొననున్న నేపథ్యంలో, పాదయాత్రను జూన్ 21వ తేదీ పైన వాయిదా వేశారు అని తెలిపారు. యోగా కార్యక్రమం ముగిసిన వెంటనే పాదయాత్ర ప్రారంభమవుతుంది అన్నారు. ఈ పాదయాత్రలో భాగంగా మంత్రి ధర్మవరం పట్టణంలోని ప్రతి వీధిని సందర్శిస్తూ, ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటారని తెలిపారు. గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు దారి తీసేలా చర్చలు జరగనున్నాయని తెలిపారు.ఈ పాదయాత్ర ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే వేదికగా మారనుంది అని తెలిపారు. ప్రజల సమస్యలు వినడం, పరిష్కార మార్గాలను సమీక్షించడం, అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్లడం వంటి ముఖ్య ఉద్దేశ్యాలతో ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు అని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు