Tuesday, June 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెరిసిన ధర్మవరం బిఎస్కే చెస్ ప్రొఫెషల్ అకాడమీ క్రీడాకారులు…

మెరిసిన ధర్మవరం బిఎస్కే చెస్ ప్రొఫెషల్ అకాడమీ క్రీడాకారులు…

చెస్ కోచ్- ఎస్. ఆదిరత్నకుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; మే నెల 29వ తేదీ నుండి 31 వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గామలో జరిగిన ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో బిఎస్ కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ ప్లేయర్స్ వివిధ రాష్ట్రాల(గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా) రేటడ్ ప్లేయర్స్ తో పోటీ పడి పతకాలు సాధించడం జరిగిందని బిఎస్కే చెస్ కోచ్ రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ. సహృద్ – అండర్-13 (ఓపెన్ ) మొదటి స్థానం (5000+ట్రోఫీ ) కాగా, బి శివకృష్ణ నాలుగవ స్థానంలో 2000+ట్రోపీ (బెస్ట్ ఆన్ రేటెడ్ క్యాటగిరి) రావడం జరిగిందన్నారు.అంతే కాకుండా
ఇంటర్నేషనల్ చెస్ ఫిడే రేటింగ్ కూడా 4 గురు చెస్ క్రీడాకారులు రేటింగ్ కూడా సాధించడం జరిగింది అని తెలిపారు. అందులో బి.శివకృష్ణ 6పాయింట్లు 9గాను.సాధించిన. రేటింగ్ 1550+, ఎస్ బి. కేధర్ నాథ్ గుప్తా 5పాయింట్లు 9గాను సాధించిన రేటింగ్.. 1540+,
పి. కిషోర్ కుమార్ 5పాయింట్లు
సాధించిన రేటడ్ పాయింట్స్.. 1530+,
పి.హర్ష చైతన్య… 4.5 పాయింట్స్ 9 గాను సాధించిన రేటింగ్ పాయింట్స్ 1450+, వీరు అందరు బి ఎస్ కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ చీఫ్ కోచ్ S. ఆది రత్న కుమార్ నందు శిక్షణ తీసికొని సాధించిననందు లకు కోచ్ ఆది రత్న కుమార్ హర్షం వ్యక్తం చేసారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాదించాలి అని తెలుపుతూ చెస్సును మరింత అభివృద్ధి బాటలో నడపాలని తెలిపారు. పట్టణంలోని పలువురు చెస్ క్రీడాకారులు కూడా ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు