Homeతెలంగాణవిద్యారంగం నిర్వీర్యం

విద్యారంగం నిర్వీర్యం

- Advertisement -
  • విద్యార్థులకు విద్య దూరం చేసే కుట్ర
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
  • ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించండి
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలి: ఏఐ‌ఎస్‌ఎఫ్

విశాలాంధ్ర- హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఏఐ‌ఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్‌ఏ స్టాలిన్ విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల కస్టర్ గా తగ్గించడం కాదని, ప్రభుత్వ బడుల సమస్యలు పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిమాయత్ నగర్ లోని మఖ్దూంభవన్ లో ఏఐ‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దినేష్ సిరంగరాజ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నూతన విద్యావిధానం పేరుతో విద్య కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పోరేటీ కరణ, వ్యాపారీకరణకై ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. వికసిత్ భారత్ శిక్ష± అదిష్టాన్(వీబీఎస్‌ఏ) బిల్లు -2025 పేరుతో యూనివర్సీటీలను దెబ్బతిసి ఉన్నత విద్యకు పేద వర్గాలను దూరం చేస్తోందని, యూజీసీ నూతన మార్గదర్శ కాలు రాజ్యంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. విశ్వవిద్యాలయాలలో ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అమలుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు ముక్త్ కంఠంతో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాల్సిం దేనన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు, పోరట్ల్ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం ఆయన పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలిన్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలైనా నేటికీ విద్యా శాఖ మంత్రిని కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈవో, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు. అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న నిధులు విడుదల చేయకపోవడంలో అంతర్యం ఏమిటనే ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.పదివేల కోట్ల పైగా స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల కస్టర్లుగా చేసే ఆలోచనలు విరమించుకోవాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దుచేసి రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానం పంపాలని, విద్యార్థులకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐ‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఇటికాల రామక్రిష్ణ, గ్యార నరేష్, బానోత్ రాఘురాం, రహమాన్, చిట్యాల రాజు, బాలసాని లెనిన్, రాష్ట్ర సమితి సభ్యులు ఎం. చైతన్య కుమార్, మచ్చ రమేష్, ముదిగొండ మురళీకృష్ణ, ఎండీ అన్వర్, అనిల్, బాషబోయిన సంతోష్, ల్యాదల్ల శరత్, శాంతి కుమార్, వరక అజిత్, జోసెఫ్, ఉదయ్, సాగర్, ప్రేమ కుమార్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు