Friday, May 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలి..

బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలి..

ముస్లిం మత పెద్దలు
విశాలాంధ్ర ధర్మవరం;; బక్రీద్ పండుగను పట్టణంలోని ముస్లింలందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు, ఇమామ్ సహాబ్లు, మౌలానాలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జామియా మసీదులో ముస్లిం మత పెద్దలు సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ముస్లిం మత పెద్దలతో తో చర్చించి అందరి సమక్షంలో ఈ సంవత్సరం బక్రీద్ పండుగ నమాజ్ మునుపటి లాగే ఈ సంవత్సరం కూడా బెంగళూరు రోడ్ లోని కాలనీ ఈద్గా మైదానంలో మాత్రమే జూన్ 7వ తేదీ శనివారం ఉదయం 7;30 నమాజ్ కొరకు జమాత్ నిలబడునని తీర్మానించడం జరిగిందని తెలిపారు. ధర్మవరంలోని ముస్లిం సోదరులు పెద్దలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయానికి ముందే ఈద్గా మైదానంలో చేరుకోవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు వివిధ మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు