అధ్యక్షులు జయసింహ, కోశాధికారి సుదర్శన్ గుప్త
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని క్లబ్ అధ్యక్షుడు జయసింహ, కోశాధికారి సుదర్శన్ గుప్త, క్యాంపు చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం జయసింహ, సుదర్శన్ గుప్తా మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా అన్నపూర్ణ రెడీ మిక్స్ కాంక్రీట్..(దాత చంద్రశేఖర్) అనంతపురం దాతృత్వంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి 175 మంది రోగులకు కంటి వైద్య చికిత్సలను అందించగా అందులో 136 మంది ఆపరేషన్ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 35,000 మందికి ఆపరేషన్లతో పాటు ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత పాటించవలసిన నియమములు సూచనలు, వైద్యులు తెలపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, శివయ్య, రమేష్ బాబు, కొండయ్య, సత్రశాల ప్రసన్నకుమార్, మనోహర్ గుప్తా ,కృష్ణమూర్తి ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
RELATED ARTICLES