నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్లు అభివృద్ధి పనులు ప్రజలను దృష్టిలో ఉంచుకొని, మంత్రి, ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రజల అవసరాలకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్డు అభివృద్ధి పనులను వారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పట్టణంలోని 27 వ 28వ వార్డుల్లో నాణ్యతతో రోడ్డు పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ నిర్మాణ పనులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. పనుల నాణ్యతతో సమయపాలనతో పూర్తి అవ్వాలన్నదే మా అభిమతం అని, నిర్లక్ష్యం సహించబడదని వారు స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధి పనుల పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు కూడా లభిస్తోందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రజల అవసరాలకే మేము ప్రాధాన్యత ఇస్తాం..
RELATED ARTICLES