Friday, May 30, 2025
Homeబద్వేల్‌`నెల్లూరు రహదారి అభివృద్ధి

బద్వేల్‌`నెల్లూరు రహదారి అభివృద్ధి

వరి సహా 14 పంటల మద్దతు ధర పెంపు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూదిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌- నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఖరీఫ్‌ సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు (ఎంఎస్‌పీ) ధర రూ.2369కి చేరింది. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడిరచారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్‌ పంటలకు ఎంఎస్‌పీ భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ కోసం ఎంఎస్‌పీ పెంపును కేంద్ర కేబినెట్‌ ఆమోదించిందన్నారు. ఆయా పంటలకు ఎంఎస్‌పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లుతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పోషక తృణధాన్యాలను కాకుండా ఇతర పంటల సాగును బాగా ప్రోత్సహిస్తోంది. ఆ పంటలకు అధిక ఎంఎస్‌పీని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీలోని బద్వేల్‌- నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. బద్వేల్‌లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్‌తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది. ఈ కారిడార్‌ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది. ఇక రత్లాం-నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్చేందుకు, వార్దా-బల్లార్షా రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్పు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.
ఏ పంటకు ఎంత ఎంఎస్‌పీ?
వరి సహా మొత్తం 14 ఖరీఫ్‌ పంటలకు క్వింటాల్‌పై కనీస మద్దతు ధర కేంద్రం పెంచింది. వీటిలో వరి సాధారణ, గ్రేడ్‌- ఏ లకు రూ.69 పెంచగా.. జొన్నలు రూ. 328Ñ సజ్జలు రూ.150Ñ రాగులు రూ.596Ñ మొక్కజొన్న రూ.175Ñ కందిపప్పు రూ.450Ñ పెసర రూ.86Ñ మినుములు రూ.400Ñ వేరుశెనగ రూ.480Ñ పొద్దుతిరుగుడు రూ.441Ñ సోయాబీన్‌ రూ.436Ñ కుసుమలు రూ.579Ñ వలిశలు (గడ్డినువ్వులు) రూ.820Ñ పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు