Sunday, June 1, 2025
Homeమూడు రోజులు మోస్తరు వర్షాలు

మూడు రోజులు మోస్తరు వర్షాలు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిరచింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా గుర్లలో 87.5మి.మీ, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సెట్టివారిపల్లిలో 87.5మి.మీ, విజయనగరం జిల్లా వేపాడలో 79.2 మి.మీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79 మి.మీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74 మి.మీ వర్షపాతం నమోదయిందని తెలిపారు. వచ్చే మూడు రోజుల్లోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అందాల భామలు సుమారు 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ (తప్పకుండా తెలంగాణకు రండి) నినాదాన్ని ప్రపంచవ్యాపితం చేశారు.
‘మిస్‌ వరల్డ్‌2025’ కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఫైనల్స్‌ను అట్టహాసంగా నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతలుగా మిస్‌ వరల్డ్‌2016 స్టెఫానీ డెల్‌ వాలె, భారతీయ ప్రెజెంటర్‌ సచిన్‌ కుంభర్‌ వ్యవహరిస్తారు. బాలీవుడ్‌ తారలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, ఇషాన్‌ ఖట్టర్‌ తదితరులు తమ ప్రదర్శనలతో ఆదరగొట్టనున్నారు.
మిస్‌ వరల్డ్‌ న్యాయ నిర్ణేతల్లో ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌, సుధా రెడ్డి, డాక్టర్‌ కారినా టర్రెల్‌ (మిస్‌ ఇంగ్లాండ్‌2014), మిస్‌ వరల్డ్‌ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్‌ వరల్డ్‌2017, బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ అందాల పోటీల్లో భాగంగా నటుడు సోనూ సూద్‌కు ‘మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు’తో సన్మానిస్తారు. మిస్‌ వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలే ‘సోనీ లివ్‌’లో ప్రసారం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వాచ్‌ మిస్‌ వరల్డ్‌.కామ్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పించారు.
108 మంది పోటీదారులలో ప్రతి ఖండం (అమెరికా, కరీబియన్‌, ఆఫ్రికా, యూరప్‌, ఆసియా, ఓషియానియా) నుంచి 10 మంది సెమీ ఫైనలిస్టులు కాగా 40 మంది క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరతారు. కొందరు ఫాస్ట్‌-ట్రాక్‌ ఛాలెంజ్‌ల ద్వారా క్వార్టర్‌ ఫైనల్స్‌కు వచ్చారు.హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌ ద్వారా అన్నాలిసే నాంటన్‌ (త్రినిటాడ్‌టొబాగో), టాప్‌ మోడల్‌ ద్వారా ఆరెలీ జోకిమ్‌ (మార్టినిక్‌), బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ ద్వారా వలెరియా పెరెజ్‌ (ప్యూర్టో రికో), మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్‌ రిపబ్లిక్‌) ఎంపికయ్యారు. అలాగే, ఫైత్‌ బ్వాల్యా (జాంబియా), టాప్‌ మోడల్‌ ద్వారా సెల్మా కమన్య (నమీబియా), బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా), మల్టీ మీడియా అవార్డు ద్వారా ప్రిన్సెస్‌ ఇస్సీ (కామెరూన్‌), యూరప్‌ నుంచి స్పోర్ట్‌ ఛాలెంజ్‌ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్టోనియా), హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌తో పాటు బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ ద్వారా మిల్లీ మే ఆడమ్స్‌ (వేల్స్‌), టాప్‌ మోడల్‌ ద్వారా జాస్మిన్‌ గెర్హార్డ్ట్‌ (ఐర్లాండ్‌), మల్టీ మీడియా అవార్డ్‌ ద్వారా ఆండ్రియా నికోలిచ్‌ (మాంటెనెగ్రో), ఆసియా ఓషియానియాకు ప్రాతినిధ్యం వహించే వారిలో టాలెంట్‌ అండ్‌ బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ ద్వారా మోనికా కెజియా సెంబిరింగ్‌ (ఇండోనేషియా), హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌ ద్వారా ఇడిల్‌ బిల్గెన్‌ (టర్కీ), టాప్‌ మోడల్‌ ద్వారా నందిని గుప్తా (భారతదేశం), మల్టీ మీడియా అవార్డు ద్వారా ఓపల్‌ సుచాతా (థాయిలాండ్‌) క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మిగిలిన సెమీఫైనలిస్టులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా జూరీ ఎంపిక చేస్తుంది. టాప్‌ 5గా ఎంపికయ్యే వారు చివరి ప్రశ్నకు ఇచ్చే సమాధానం ఆధారంగా మిస్‌ వరల్డ్‌ ఎన్నికవుతారు. విజేతకు మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని మాజీ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్‌ వరల్డ్‌) అందజేస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు