Friday, May 30, 2025
Home24 గంటల్లో వాయుగుండం

24 గంటల్లో వాయుగుండం

. బలపడిన అల్పపీడనం
. భారీ వర్ష సూచన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం బలపడిరది. రాష్ట్రంలోకి పూర్తిస్థాయిలో నైరుతి పవనాలు విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగళాఖాతంలో అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలులున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే రుతు పవనాల రాకతో రాష్ట్రంలో చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. అక్కడక్కడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. రుతు పవనాల విస్తరణతో వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం బుధవారం ఉదయం 8.30 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధంగా తుపాను ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఎత్తుకు వెళ్లేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఈనెల 29వ తేదీన పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు