విశాలాంధ్ర- ధర్మవరం; ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ , నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సరోజమ్మ కళా బృందం తో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగముగ పట్టణంలోని ప్రధాన మార్కెట్ సర్కిల్ నందు వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి,ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు , చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017 గూర్చి ప్రజలలో సరోజమ్మ కళా బృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో ధర్మవరం వైద్యాధికారి డా.నజీర్ ,ఐసిటిసి కౌన్సెలర్ వనమాల ల్యాబ్ టెక్నీషియన్ .భార్గవి , శక్తి మైత్రి మహిళా సంఘం పి.యూ ధర్మవరం ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్,ఓ.ఆర్.డబ్ల్యూ త్రివేణి, లక్ష్మీ, కవిత, సరస్వతి, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వీధి నాటకం ద్వారా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన
RELATED ARTICLES