గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా తెలుగు పద్యాలు, తెలుగు వ్యాకరణం పై అవగాహనను టీచర్ వెన్నెల ద్వారా మెలకువలను, శిక్షణగా ఇవ్వడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు తెలుగు వ్యాకరణం, పద్యాలు విషయాలపై మెలుకువలను తెలుసుకున్నప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని, సులభతరం అవుతుందని తెలిపారు. పూర్వపు కాలము నుండి పద్యాలు ఎంతో ప్రాముఖ్యతను చాటుకున్నాయని తెలిపారు. అదేవిధంగా పిల్లలు కూడా ధ్యాన యోగం కూడా చేసుకోవాలని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
తెలుగు పద్యాలు, వ్యాకరణం పై అవగాహన..
RELATED ARTICLES