విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్రీయ బాలల స్వస్థ కార్యక్రమం లో భాగంగా,జిల్లా త్వరిత చికిత్స కేంద్రం నందు డి ఎం అండ్ హెచ్ ఓ మరియు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశానుసారం ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.జి .నారాయణస్వామి ఆధ్వర్యంలో జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వంకర పాదాలు గల నవజాత శిశువుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డా .నారాయణస్వామి మాట్లాడుతూ… ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరికి ఇలా వంకర పదాలతో పుట్టే అవకాశం ఉంది అన్నారు. వీటికీ ప్రత్యేక కారణాలు ఏమీ లేవు ,కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు యొక్క అవయవ లోపలను గుర్తించుటకు నేడు టిఫా స్కాన్ కూడా అందుబాటులో ఉందన్నారు. వంకరపాదాలు గల నవజాత శిశువులకు డి ఈ ఐ సి సెంటర్ లో తగిన చికిత్స ఉచితంగా అందించబడుతుంది.దాదాపు 4-5 సార్లు పిండికట్లు కట్టిన తర్వాత ప్రత్యేకమైన షూ అమర్చడం జరుగుతుందన్నారు. పూర్తి నడక వచ్చేలోపు పిల్లలకు పాదాలు మామూలు స్థితికి వస్తాయి.ఇలాంటి పిల్లలకు ఉచితంగా సేవలు అందిస్తామన్నారు. .ఇప్పటి వరకు వంకర పాదాలతో 24-25 సంవత్సరంలో 30మంది పిల్లలను గుర్తించి సంపూర్ణంగా చికిత్స ఇవ్వడం జరిగిందన్నారు. 10 మంది పిల్లలకు ఉచితంగా టెనోటామీ సర్జరీ చేయడం తో ఇందులో 20 మంది పిల్లలు సాధారణ స్థితికి వచ్చారన్నారు .12 మంది పిల్లలు ఫాలో అప్ లో ఉన్నాయన్నారు. .జిల్లాలోని ప్రతి ప్రసవ కేంద్రం వద్ద ఇలాంటి పిల్లలను గుర్తించి డి ఈ ఐ సి సెంటర్ నకు వచ్చినచో చికిత్స సులభతరం అవుతుందన్నారు .ఈ కార్యక్రమంలో మేనేజర్ రజిత ,ఎం ఓ జగదీశ్ ,ఫిజియోథెరపిస్టు డాక్టర్ దరీషా క్యూర్ ఇండియా నుంచి శ్రీమతి మైన మరియు డిఈ ఐ సి సిబ్బంది పాల్గొన్నారు .