Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలను నమ్మించి వంచించడం చంద్రబాబు నాయుడు యొక్క నైజం..

ప్రజలను నమ్మించి వంచించడం చంద్రబాబు నాయుడు యొక్క నైజం..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచించడం చంద్రబాబు నాయుడు యొక్క నైజం అని, రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలుసునని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ పిలుపుమేరకు వెన్నుపోటు దినమును వారు ధర్మవరం పట్టణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా వందల సంఖ్యలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ కేతిరెడ్డి ప్రభుత్వాన్ని గూర్చి వారు మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా నిరసించారు అందుకే వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా నిర్వహించారు. ఎన్నికలకు ముందు 143 హామీలు సూపర్ సిక్స్ వంటి ప్రధాన హామీలు ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అధికారం వచ్చాక కనీసం ఒక్క హామీలు కూడా అమలు చేయకపోవడం దారుణం అని మండిపడ్డారు. ఉచిత బస్సు, నెలకు 15 వేల రూపాయలు ఏమయ్యా అని వారు ప్రశ్నించారు. అన్ని వర్గాలకు నరకం చూపించే విధంగా ఊటమి ప్రభుత్వ పాలన జరుగుతోందని తెలిపారు. రెడ్ బుక్కు రాజ్యాంగమును అమలు చేసి అమాయకులను జైల్లో పెట్టి కేసులు పెట్టి నరకయాతనకు గురి చేసే విధంగా దుర్మార్గపు పాలన కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు ఆపేది లేదని వారు తెలిపారు. నిరసన కార్యక్రమంలో వందలాదిమంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు