Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

దేశంలో ముమ్మరంగా సాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

108.47కోట్లకు పైగా డోసుల పంపిణీ
దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 108.47కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక నివేదికల ప్రకారం.. దేశంలో ఇవాళ ఉదయం 7 గంటల వరకు 1,09,98,126 సెషన్ల ద్వారా 1,08,47,23,042 డోసులు వేశారు. గడిచిన 24గంటల్లో 23లక్షలుకుపైగా టీకాలు వేశారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం.. 1,03,79,606 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు తొలి డోసు, మరో 92,69,660 మంది రెండో డోసు వేసినట్లు పేర్కొన్నది.ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌లో 1,83,72,723 మందికి తొలి.. మరో 1,60,37,946 మందికి రెండో డోసు పంపిణీ చేసినట్లు తెలిపింది. 18-44 మధ్య వయసువారిలో 42,45,43,385 మందికి మొదటి.. 15,14,76,624 మందికి రెండో డోసు టీకా వేశామని, 45-59 మధ్య వయసువారిలో 17,63,88,452 మంది మొదటి.. 9,93,34,705 మంది లబ్ధిదారులు రెండో డోసు టీకా తీసుకున్నారని చెప్పింది. 60 ఏళ్లుపైబడిన 11,06,32,907 మంది తొలి, 6,82,87,034 మంది సెకండ్‌ డోస్‌ టీకా తీసుకున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img