Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన గ్రంథాలయ వేసవి శిక్షణా తరగతులు..

ముగిసిన గ్రంథాలయ వేసవి శిక్షణా తరగతులు..

గ్రంథాలయ అధికారిన అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గత 33 రోజులుగా గ్రంథాలయములో వేసేవి శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయని గ్రంథాలయ అధికారిని ఆంజనేయ సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ అంశాలలో శిక్షణ పొందిన విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణా తరగతులలో డ్రాయింగ్స్, జనరల్ నాలెడ్జ్ ,కథలు చెప్పడం, పుస్తక పఠనం, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, డాన్స్ యోగ తదితర అంశాలలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబయ్య, మేనేజర్ సుకుమార్, రంగనాథ్, మేడ రవి, టీచర్ ముత్యాలప్ప, మురళి,ఎల్ఐసి నాగరాజు చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ శిక్షణలో 35 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణా నాయక్, శివమ్మ, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు