అన్యక్రాంతం చేసిన వారిపై 420 కేసులు నమోదు చేయాలి…
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు ఎవరైతే వున్నారో వారికీ చాలా అన్యాయం జరిగింది అని,అర్హులైన కార్మికులకు పట్టాలు ఇవ్వకుండా అనర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి అర్హులైన కార్మికుల్ని రోడ్డున పడేశారు అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూల శెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అనంతరం వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది అని, ర్యాలీలు, ధర్నాలు,అనేక ఉద్యమాలు చేసిన ఫలితమే రెవెన్యూ అధికారులు స్పందించి కార్మికుల దగ్గరకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని, 650-2 సర్వే నెంబర్ లో అనర్హులైన వారి పట్టాలను రద్దుచేసి ఎవరైతే నిజమైన కార్మికులు ఉన్నారో వారికి వెంటనే పట్టాలు మంజూరు చేస్తామని డిప్యూటీ తాసిల్దార్ సురేష్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు..అదే విదంగా రెవిన్యూ అధికారులు విచారణ చేసి 650-2,లో నకిలీ పట్టాలను కూడా రద్దు చెయ్యడం జరిగింది అని,కావున మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు చేపట్టి అక్కడ నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి,అన్యాక్రాంతం చేసిన వారిపై 420 కేసులు నమోదు చెయ్యాలని వారి డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన కార్మికుల కి పట్టాలిచ్చి వారికి న్యాయం జరిగే విదంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో, AP చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, ఆదినారాయణ, తాజుద్దీన్,రామకృష్ణ, రామసుబ్బయ్య,మసూద్, సురేంద్ర,నాగేంద్ర, చిన్న,జనార్దన్, వేణుగోపాల్,షెక్షావలి, గౌస్ లాజం, ఓబులేసు,మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.