Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయితిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో ధర్మవరం నగర సంకీర్తన

తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో ధర్మవరం నగర సంకీర్తన

విశాలాంధ్ర ధర్మవరం:: చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి దేవాలయంలో ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగర సంకీర్తన కార్యదర్శి ధర్మాచార్యులు నక్కల వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నక్కల వెంకటేష్ వారి శిష్య బృందం ఆలపించిన నగర సంకీర్తన అందరిని ఆకట్టుకుంది. 200 మంది కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగిన నగర సంకీర్తన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ రెడ్డి ,మోహన్ రెడ్డి ,ధనుంజయ రెడ్డి, వాసుదేవరెడ్డి, జయమ్మ, ఉషా, బాబు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు