విశాలాంధ్ర ధర్మవరం;; నెల్లూరులో ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే జిల్లా క్రికెట్ టోర్నీకి అనంతపురం జట్టుకు ధర్మవరం క్రికెట్ క్రీడాకారిణి జన్నే గోపి చందన ఎంపికైనట్లు క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం ఆర్డిటి స్పోర్ట్స్ సెంటర్లో శిక్షణ పొందుతున్న జెన్నే గోపీచందన అండర్ -15 బాలికల విభాగంలో అనంతపురం జట్టుకు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరంలోని ఆర్డిటి క్రీడా మైదానంలో ఎంపికైన గోపి చందనాను క్రికెట్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు వడ్డే బాలాజీ, కార్యదర్శి శివ శంకర్ లు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ డి టి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్లనే ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎంతోమంది ఈ విధంగా ఎంపిక కావడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఇటువంటి క్రీడా శిక్షణ ఆర్డిటి ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా క్రికెట్ జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక.. క్రికెట్ కోచ్ రాజశేఖర్
RELATED ARTICLES