సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : సర్వేనెంబర్ 242 కక్కలపల్లి గ్రామ పొలంలో 3.5 ఎకరాల భూమి హక్కుదారులకు చెందాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక శారద నగర్ లో నివాసం ఉంటున్న పిన్ని శ్రీనివాస్ గుప్తా కు మూడున్నర ఎకరాల భూమిని 1963 లో నుంచి సర్వేనెంబర్ 242 కక్కలపల్లి గ్రామ పొలంలో 3.5 ఎకరాల భూమిని కొనడం జరిగిందన్నారు. ఆ వివరాలు తేదీ ఎనిమిది ఆరు 8/
06 /1963 లో డాక్యుమెంట్ నెంబరు 1805/ 1963 అనంతపురంలో రిజిస్టర్ కా బడినది అప్పటినుండి ఈ భూమి మా హక్కు అనుభవంలో ఉన్నదన్న విషయాన్ని వినతి పత్రంలో పొందుపరచడం జరిగిందన్నారు.
ఈ భూమిపై అనేక దఫాలుగా పంట రుణాలు కూడా తీసుకున్నారన్నారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ మార్ట్ గేజ్ కూడా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో ఆ భూమిపై కొందరు కబ్జాదారులు అక్రమించుటకు ప్రయత్నిస్తున్నారు. వారికి అనేక ఇబ్బందులు పెడుతూ మే 31న ఇంటరూ చెన్నారెడ్డి మరియు 25 నుండి 30 మంది మాపై భౌతిక దాడులకు దిగి వారిని బెదిరించి దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు.
అదే రోజున అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స చేసుకొని జూన్ 2న ఎస్పీ కి కూడా ఫిర్యాదు చేసి దాడికి సంబంధించిన ఫోటోసు వీడియోస్ అన్ని వారికి అందజేశారన్నారు.
వారి భూమిలోగల సర్వే నంబర్ లో వేరే వాళ్ళు కొలతలు చలానా కట్టారు మీ దగ్గర ఉన్న అన్ని పత్రాలు తీసుకొని పలానా తేదీని రావాలి అని చెప్పడం జరిగిందన్నారు. వారు కొలతల కోసం వెళ్ళగానే ప్రభుత్వ సర్వేర్లు భూకబ్జార్లులు ఏకమై ఈ భూమి మాది అని మీరు కొన్నపాటి నుండి మొత్తం డాక్యుమెంట్స్ కావాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. కొందరు ప్రభుత్వ సర్వేయర్లు చేస్తున్న ఈ దురాగతలను బెదిరించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. వారి భూమికి కంచే వేయడానికి అందుకు గాను రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి బి.రమణ, అలిపిరా తదితరులు పాల్గొన్నారు.