Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇందిరమ్మ కాలనీలో ఆర్వో ప్లాంట్ కు భూమి పూజ

ఇందిరమ్మ కాలనీలో ఆర్వో ప్లాంట్ కు భూమి పూజ

భూమి పూజ చేసిన నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీలో పరిశుద్ధ త్రాగునీటి సరఫరా కోసం రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో) ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీలో ఘనంగా భూమిపూజ కార్యక్రమానికి ధర్మవరం మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ కాలనీవాసులకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించడం మంత్రి ముఖ్య లక్ష్యం అని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఆయన అహర్నిశంగా శ్రమిస్తున్నారు అని తెలిపారు. మంత్రి మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ ఆర్వో ప్లాంట్ నిర్మాణం ద్వారా కాలనీవాసులకు శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది అని పేర్కొన్నారు. కాలనీవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ, శుద్ధి నీటి ప్లాంట్ ద్వారా మా ఆరోగ్య భద్రతకు తోడ్పాటు లభిస్తుంది అని, ఈ గొప్ప పనికి కారకులైన మంత్రి కు, హరీష్ బాబు కీ, సంస్కృతి స్వచ్ఛంద సంస్థకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, రవీంద్ర రెడ్డి, నాగార్జున, చిలకల సుధాకర్, పూలకుంట్ల మహేష్, నరసింహ యాదవ్, శ్రీ రాములు, అది రెడ్డి, కుళ్లాయప్ప నాగమణి, సరస్వతి, రాములమ్మ స్థానిక కాలనీవాసులు, సేవాసంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు