కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విస్తరణ పనులకు టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొన్నది. విస్తరణ పనుల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది.