Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆలయానికి విరాళం అందజేత..

ఆలయానికి విరాళం అందజేత..

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో వెలిసిన శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయమునకు పలువురు విరాళము, బియ్యము పిచ్చి తమ దాతృత్వమును చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పాండురంగ స్వామి వీధిలో గల బంధనాథం సరోజమ్మ, లేటు వెంకటేశులు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదానం కొరకు 28 బియ్యం పాకెట్లను ఆలయ కమిటీ వారికి అందజేశారు. అంతేకాకుండా వీరు శివాలయ నిర్మాణం కొరకు 75 వేల రూపాయలను కూడా ఇవ్వడం జరిగిందని. తదుపరి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి కూడా విరాళం ఇవ్వడం జరుగుతున్నదని వారు తెలిపారు. అనంతరం సత్యసాయి నగర్ కు చెందిన ఏ. నారాయణమ్మ అన్నదానం కొరకు పదివేల రూపాయల నగదును కమిటీ వారికి అంద చేశారు. ఈ సందర్భంగా ఆలయ శిరిడి సాయి బాబా సేవ సమితి అధ్యక్షుడు కె. వీరనారాయణ, ఉపాధ్యక్షులు టి.సి. నారాయణ రెడ్డి, కార్యదర్శి సి. రామలింగయ్య, ఉప కార్యదర్శి జి సి నాయుడు, కోశాధికారి జె సూర్యనారాయణ, డైరెక్టర్ సూర్య ప్రకాష్ లు దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి పేరిటన ఘనంగా ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు