Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజూలై 9 న జరిగే సమ్మెను జయప్రదం చేయండి ..సిఐటియు

జూలై 9 న జరిగే సమ్మెను జయప్రదం చేయండి ..సిఐటియు

విశాలాంధ్ర ధర్మవరం; జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ ,కో కన్వీనర్ ఆదినారాయణ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు డి.చంద్రకళ, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం. బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై 9 వ తారీఖున సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమానమేతను ఇవ్వాలని, రాజ్యాంగపరంగా కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, నాలుగు కార్మిక కోడ్ రద్దు చేయాలని ,ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని తెలిపారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని ,కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని , మహిళలు పనిచేసే ప్రదేశాలలో భద్రత ఏర్పాట్లు ఏర్పాటు చేయాలని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలు విధానానికి కంకణం కట్టకనే మన రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానం అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసే వరకు సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇటువంటి అనేక రకాల సమస్యల సాధనకై జులై 9 వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో సంఘటిత అసంఘటిత ప్రతి కార్మికుడు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచాలని వారు పిలుపునిచ్చారూ.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ హైదర్ వలీ, ఓబులేసు, దీన, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు