కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఈనెల 16వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు (నెల రోజులు పాటు) ఉచిత కంటి పరీక్ష శిబిరమును నిర్వహిస్తున్నట్లు కంటి వైద్య నిపుణులు, రిటైర్డ్ జిల్లా ఆంధత్వ నివారణ అధికారి సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీ మధు కంటి వైద్యశాలలో వారు విలేకరులతో మాట్లాడుతూ చక్కటి కంటిచూపు-చక్కటి విద్యకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అదేవిధంగా కళ్ళజోడు వాడుతున్న వారు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకొని, అందుకు అనుగుణంగా కళ్ళజోడు మార్పించుకోవలసిన అవసరం ఎంతైనా కలదు అని వారు స్పష్టం చేశారు. అప్పుడే చదువులో బాగా రాణించాలంటే చక్కటి కంటిచూపు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కావడం జరిగిందని, తల్లిదండ్రులు కూడా గమనించి పిల్లల యొక్క కంటి చూపును చూడాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లో బోర్డుపైన అక్షరాలు సరిగా కనపడని వారు, కొత్తగా కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అందులో దృష్టిలోపాన్ని గుర్తిస్తే కళ్ళజోడు తప్పక ఉపయోగించవలసి ఉంటుంది అని తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరమును విద్యార్థులందరూ ఉపయోగించుకొని చక్కటి కంటిచూపుతో చక్కటి విద్యను పొందాలని వారు తెలిపారు.
విద్యార్థులకు నెల రోజులపాటు ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహణ..
RELATED ARTICLES