నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా దొరగారికి సోయి రావడం లేదని సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏడేండ్లలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ మాత్రమేనని.. సీఎం కేసీఆర్కు ఉద్యోగాల భర్తీపై ఉన్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని అన్నారు. వైన్సుల ఏర్పాటుకు మాత్రం పుంఖానుపుంఖాలుగా టెండర్లు, ఉద్యోగాల భర్తీపై మాత్రం పెదవి విప్పడం లేదన్నారు.