సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లులను పెండింగ్లో ఉంచే వ్యవహారాన్ని పరిశీలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంలో, నేపాల్,బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను కూడా ప్రస్తావించింది.బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది.
రాష్ట్రాలు తయారు చేసిన బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్లు సమగ్రంగా పరిశీలించడానికి నిర్దేశించిన గడువును సుప్రీంకోర్టు నిర్ణయించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రజా ప్రాముఖ్యత, లేదా ఏ విధంగానైనా ప్రజలను ప్రభావితం చేసే చట్టాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే హక్కును స్పష్టంగా పేర్కొన్నారు.ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈ సందర్భంలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం పట్ల మేమే గర్విస్తున్నాము అని చెప్పారు.
బిల్లులను రిజర్వ్ చేయడాన్ని సమర్ధించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
ఁమన పొరుగు దేశాల్లో ఏమి జరుగుతుందో చూడండి, నేపాల్ పరిస్థితిని చూశాము అని అన్నారు.
నేపాల్లో జెన్ జెడ్ యువత వ్యవహరించిన హింసాత్మక ఆందోళనలను సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
ఆ ఆందోళనల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బంగ్లాదేశ్లో కూడా ఇలాంటివి జరిగాయని జస్టిస్ విక్రమ్ నాథ్ జోక్యం చేసుకున్నారు.గతేడాది బంగ్లాదేశ్లోని హింసాత్మక అల్లరుల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.గవర్నర్లు ఒక నెలకు పైగా బిల్లులను రిజర్వ్ చేయడాన్నిసమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
1970 నుంచి 2025 వరకు కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ అయ్యాయి
రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన బిల్లులలో 90 శాతం బిల్లులు ఒక నెలలోపే గవర్నర్లు ఆమోదిస్తారని తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.1970 నుంచి 2025 వరకు కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని కూడా ఆయన కోర్టుకు తెలిపారు.అయితే, ఈ గణాంకాలపై న్యాయమూర్తులు ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 7 బిల్లులను రిజర్వ్ చేయడంతో, డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


