- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం ; ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి ఫుట్బాల్ అండర్ 14 బాలికల విభాగంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్న సాజియా తన ప్రతిభను కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగింది. త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆ విద్యార్థిని పాల్గొంటుందని హెడ్మాస్టర్ శారద, ఫిజికల్ డైరెక్టర్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, పిడి, పాఠశాల విద్యార్థులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు


