- Advertisement -
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి లోని కరిబండి విద్యా సంస్థ ల ఆధ్వర్యంలో ని ఎస్.కె.జి.ఆర్ అండ్ ఎస్.ఏస్.కె జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎం.పి.సి చదువుతున్న వేగేశ్వర పురం కు చెందిన దూపాని మహేష్ అండర్ 19 సీనియర్ విభాగం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యారు. ఇటీవల 8న పెదవేగి లో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటిల్లో కెప్టెన్ గా ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. రాష్ట్ర స్థాయి లో ఆడే అర్హత సాధించాడు. ఈ సందర్బంగా కళాశాల డైరెక్టర్ కరిబండి త్రినాధ్ స్వామి, ప్రిన్సిపాల్ పి.మురళి, అధ్యాపకులు డి.మాధవరావు, రాజ్ పాల్, శ్రీధర్, ఎం.సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.


