Homeజిల్లాలుఅనంతపురంఎమ్మెల్యేలు అంటే ప్రజా సేవకులే...

ఎమ్మెల్యేలు అంటే ప్రజా సేవకులే…

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : ఎమ్మెల్యేలు అంటే ప్రజాసేవకులే కానీ ప్రజలను ఇంటి చుట్టూ తిప్పుకోవడం కాదని తాడిపత్రి వైసిపి మాజీ సమన్వయ కర్త విఆర్. రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక విఆర్ నివాసం వద్ద వైసిపి మాజీ సమన్వయ కర్త విఆర్. రామిరెడ్డి ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా దాదాపు 250 మంది ఆటో డ్రైవర్లకు దుస్తులు పంపిణీ, డ్రైవర్లకు ఉచితంగా లైసెన్సులు కూడా ఇప్పిస్తానని విఆర్. రామిరెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే గతంలో తాడిపత్రి, గుంతకల్, నియోజక వర్గాలలో డౌన్ పేమెంట్ కట్టి 450 ఆటోలకు పైగా డ్రైవర్లకు ఆటోలను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా విఆర్. రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను తీర్చలేని ఎమ్మెల్యేలను ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీయాలని అన్నారు. ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ప్రజలను తిప్పుకునే ఎమ్మెల్యేలు ప్రజలకు అవసరం లేదని, ప్రజల చుట్టూ తిరిగే ఎమ్మెల్యేలు ప్రజలకు అవసరమన్నారు. ఎమ్మెల్యేలు ప్రజా సేవకులు కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు ప్రతినెల దాదాపు 3 లక్షల రూపాయల జీతం వారికి మన రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా పింఛన్ రూపంలో ప్రతినెల వారికి డబ్బు వచ్చినట్టు మన ప్రభుత్వాలు ప్రజాధనంతో ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పలు నగరాలలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే ఎమ్మెల్యేలు లేరని విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు