బాలీవుడ్కు చిరస్మరణీయమైన నటుడు ధర్మేంద్ర ఇకలేరన్న వార్త భారతీయ సినీ వర్గాలను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులకు గాఢమైన విషాదాన్ని మిగిల్చింది. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న ఆయన కన్నుమూశారు. ఇటీవల కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ సుమారు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం మరింత దిగజారడంతో డిశ్చార్జ్ అయ్యి తనయుడు బాబీ డియోల్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ధర్మేంద్ర ఇక లేరనే వార్త వినగానే హిందీ చిత్రసీమ అంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.
అమర సైనికుడి తండ్రిగా ధర్మేంద్ర
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర చివరిగా ఏ సినిమాల్లో నటించారన్న అంశంపై చర్చ మొదలైంది.
ఆయన ఆఖరి చిత్రం ఃఇక్కిస్ః. ఈ సినిమా పోస్టర్ నవంబర్ 24న సోమవారం విడుదల కాగా, లెజెండరీ నటుడు ఇక లేరన్న బాధలో ఉన్న అభిమానులు ఆ పోస్టర్ను చూసి మరింత ఎమోషనల్ అవుతున్నారు.
ఈ సందర్భంగా సినిమా యూనిట్ భావోద్వేగభరితమైన సందేశాన్ని కూడా పంచుకుంది. ఁతండ్రులు కుమారులను పెంచుతారు… అయితే మహానుభావులు మాత్రం దేశాన్ని తీర్చిదిద్దుతారు. మా చిత్రంలో ధర్మేంద్ర గారు అమర సైనికుడి తండ్రిగా ఎంతో శక్తివంతమైన పాత్ర పోషించారు.ఁ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 డిసెంబర్ 25న విడుదల కానుందని ప్రకటించారు.
అరుణ్ ఖేత్రపాల్ పాత్రలో అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్త్య నందా
ఃఇక్కిస్ఃలో ధర్మేంద్ర బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేత్రపాల్ పాత్రలో కనిపించనున్నారు.
సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్కు తండ్రిగా ఆయన చేసిన పాత్ర హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. పోస్టర్లో ఆయన తన కుమారుడి త్యాగాన్ని స్మరించుకుంటూ, ఇతడు నా పెద్ద కొడుకు అరుణ్… ఇది ఎల్లప్పుడూ అతనిదేఁ అని భావోద్వేగంతో చెప్పడం కనిపిస్తుంది.ఈ చిత్రంలో అమర వీరుడు అరుణ్ ఖేత్రపాల్ పాత్రను అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్త్య నందా పోషిస్తున్నాడు.1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఆయన చూపిన అసామాన్య వీరత్వానికి మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం లభించింది.
చివరి చిత్రం విడుదలకై ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు
ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ఇక్కిస్ కావడంతో, ఈ చిత్రం ఆయన అభిమానులకు మరింత భావోద్వేగపూరితమైనదిగా మారింది.అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్టులతో ఆయనను స్మరించుకుంటూ, చివరి చిత్రం విడుదలకై ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


