Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వరదలపై కేంద్రానికి గవర్నర్‌ తమిళిసై నివేదిక..నేడు హస్తినకు కేసీఆర్‌

తెలంగాణ రాజకీయాలు ఢల్లీికి మారుతున్నాయి. ఇప్పటికే గవర్నర్‌ తమిళిసై ఢల్లీి పర్యటనకు వెళ్లగా… ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేసీఆర్‌ నేడు ఢల్లీి పర్యటనకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరనున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్‌ ఇప్పటికే అనేకసార్లు ఢల్లీికి వెళ్లి జాతీయ నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఢల్లీికి వెళ్తున్న ఆయన రెండు మూడు రోజులు అక్కడే బస చేసిన కీలక నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.
వరదలపై కేంద్రానికి గవర్నర్‌ తమిళిసై నివేదిక..
మరోవైపు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇప్పటికే ఢల్లీికి వెళ్లి రాష్ట్రపతి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరదల సమయంలో తెలంగాణ ప్రథమ పౌరురాలిగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. వరదలకు సంబంధించిన నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేసినట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఆమె పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌ సైతం ఢల్లీికి వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img