Friday, May 3, 2024
Friday, May 3, 2024

వెంకయ్యనాయుడి నుంచి సమాజం చాలా నేర్చుకోవాలి : ప్రధాని మోదీ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని..అనేక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ నెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తిచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ..ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు.. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్‌చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్‌ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img