Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మంత్రి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్న రాజంపేట తాసిల్దార్

విశాలాంధ్ర -రాజంపేట: వృత్తినే దైవంగా భావించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ప్రజల హృదయాలలో అనతి కాలంలోనే సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజంపేట తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి సోమవారం రాయచోటి జిల్లా కేంద్రంలో జరిగిన 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిష ఆధ్వర్యంలో ఉత్తమ తాసిల్దార్ గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల రాజంపేట నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివిధ రకాల సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికే పెద్దపేట వేస్తున్నారు. ఎన్నో ఏళ్లగా పరిష్కారం కానీ భూ సమస్యలకు రికార్డులను పరిశీలించి సత్వరమే సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నదే ఆయన లక్ష్యం. రాజంపేట తాసిల్దార్ ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందుకోవడం పట్ల రెవిన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img