Homeఅంతర్జాతీయంయూఏఈలో డ్రోన్ దాడి.. భారతీయులకు గాయాలు.. స్పందించిన కేంద్రం

యూఏఈలో డ్రోన్ దాడి.. భారతీయులకు గాయాలు.. స్పందించిన కేంద్రం

- Advertisement -

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ఆయిల్ పరిశ్రమ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు.ఈ ఘటనపై భారత కేంద్ర విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది.పౌర మౌలిక సదుపాయాలు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకునే దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనేలా చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని తెలిపింది.కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా హర్మూజ్ జలసంధి గుండా నిరాటంకంగా నౌకాయానం, వాణిజ్యం కొనసాగాలని భారత్ ఆశిస్తున్నట్లు చెప్పారు.పశ్చిమాసియాలో సమస్యలను శాంతియుత మార్గాల్లో పరిష్కరించేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై జరిగిన ఈ దాడి నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.అమెరికాతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా దేశాలు ఇరాన్‌ను కోరాయి.ఈ ఘర్షణల వల్ల హర్మూజ్ జలసంధిని, ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టొద్దని హెచ్చరించాయి.

ఫుజైరా ప్రాంతంలోని చమురు శుద్ధి కేంద్రంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని ఇరాన్ అధికారిక మాధ్యమాలు తెలిపాయి.నిషేధిత మార్గాల ద్వారా హర్మూజ్ జలసంధిలో నౌకలను బయటకు తీసుకురావడానికి అమెరికా చేస్తున్న చర్యలే ఈ ఘటనకు కారణమని ఆరోపించాయి.
ఇకపై దౌత్య ప్రక్రియలో బలప్రయోగాన్ని వదిలేయాలని అమెరికాను కోరాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే సున్నిత ప్రాంతమైన హర్మూజ్ జలసంధిలో సైనిక చర్యలను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు