డీ ఎం.హెచ్ఒ శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ.డా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రపంచ పొగాకు ప్రత్యేక దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభవిస్తాయి అన్నారు, ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31st ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు,, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధం తెలిపారు,,, 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు పదార్థాలు విక్రయించరాదు అని తెలిపారు, పొగాకు వినియోగం వలన కలగు అనర్థాలను గురించి, ప్రజలకు అవగాహన కల్పించడానికి జూన్ 1 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సోమవారం జరుపుకుంటున్నాము అని తెలియచేసారు, జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు మాట్లాడుతూ… పొగ తాగడం వలన అనేక భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయి,, పొగాకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని తెలిపారు, విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు దుకాణాలను ఉండరాడని ఇన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు
పొగ తాగే వారి కన్నా పీల్చే వారికే 60% క్యాన్సర్ వచ్చే ప్రమాదమని తెలిపారు.. పొగాకు అలవాటు ఉన్నవారు ఈ వ్యసనాన్ని వెంటనే మానుకోవాలి తెలియజేసారు ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్ సి డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విష్ణుమూర్తి,, డెమో నాగరాజులు,గంగాధర్, జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు ఎన్ సి డి సిబ్బంది ఆంజనేయులు,ప్రేమ్,కిషోర్, మౌనిక, శశికల, పాల్గొన్నారు


