విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని సుదర్శన్ కాంప్లెక్స్ పక్కన గల మున్సిపల్ కాంప్లెక్స్ లో నేత్రాలయ ఐ క్లినిక్ వారి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారిచే ఉచిత ప్రత్యేక కంటి వైద్య శిబిరమును ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నేత్రాలయ ఐ క్లినిక్ శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆప్తాల్- డివోఏ..ప్రవీణ్ కుమార్ కంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమం కింద నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆపరేషన్కు ఎంపికైన వారు తప్పనిసరిగా ఒరిజినల్ ఆరోగ్యశ్రీ, కార్డు ఆధార్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. కంటి శుక్లాలు గుర్తించిన వారికి ఉచిత కంటి (కుట్లు లేని) ఆపరేషన్లు చేయించబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.