ముంబై: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా జూన్ 2026లో తన అత్యధిక హోల్సేల్ పనితీరును నమోదు చేసింది. 2025లోని ఇదే నెలతో పోలిస్తే జూన్ 2026లో 30% వార్షిక (వై ఓ వై) వృద్ధితో, ఈ కార్ల తయారీ సంస్థ ఆ నెలలో 7,568 యూనిట్ల హోల్సేల్ అమ్మకాలను నివేదించింది. ఈ పటిష్టమైన పనితీరు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐ సి ఈ), న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ ఈవి) మోడళ్లను కలిగి ఉన్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విభిన్న ఉత్పత్తి శ్రేణికి లభించిన బలమైన ఆదరణను ప్రతిబింబిస్తుంది. జూన్ 2026 నాటికి జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలలో 75% పైగా వాటాతో, ఎలక్ట్రిక్ వాహనాలు ఆ సంస్థ వృద్ధికి చోదకాలుగా నిలిచాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ ఈవీ నిర్వహణ ఖర్చులు, పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఎలక్ట్రిక్ మొబిలిటీ పట్ల వినియోగదారుల ప్రాధాన్యతను మరింత వేగవంతం చేశాయి.


