ఈనెల 23,24 తేదీలలో జరిగే మహాసభలను జయప్రదం చేయండి…
ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర అనంతపురం : రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి గ్రామానికి త్రాగునీరు కై ఈనెల 22,23 వ తేదీన కడప లో జరిగే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ప్రాజెక్టుల మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏ పి రైతు సంఘం విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి.చిన్నప్ప యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మళ్ళికార్జున మాట్లాడుతూ… కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమకు శాశ్వత విముక్తి కల్పించడానికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించి ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి గ్రామానికి త్రాగునీరు కల్పించే దిశగా నికర జలాలు కేటాయించాలనే లక్ష్యంతో మరో మారు ఉద్యమించే దిశగా కడపలో ప్రాజెక్టుల సదస్సు జరుగుతున్నారు కరువు సీమకు కృష్ణ జలాలే ఏకైక శరణ్యమని గతంలోనే రైతు సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితంగా హంద్రీనీవా ,గాలేరు ,నగరి, ప్రాజెక్టులను తీసుకొని వచ్చారన్నారు. కానీ నేటికీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రాయలసీమ పేరు చెప్పి అన్ని ప్రాజెక్టుల ను పూర్తి చేస్తున్నామన్నారు. రాయలసీమలో ఉండే ఎండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు.
వరుస కరువుతో ఇబ్బందులు పడుతూ వేసిన పంటలు పండక అప్పులు ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు, ఆకలి చావుల, వలసలకు నిలయమైన
అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీనీవా ప్రాజెక్టును ఆదిలోనే చంపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాలువను పదివేల క్యూస్షన్ కు పెంచి సాగు భూములకు నీరు ఇవ్వకుండా ఇప్పుడు రెండవ దశ కాలువకు లైనింగ్ చేయడానికి పూనుకున్నారని పేర్కొన్నారు. కాలువకు లైనింగ్ చేస్తే జిల్లా రైతులకు ఉరితాడు బిగించినట్లు అవుతుందన్నారు.
హంద్రీనీవా కాలవను వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ జిల్లాలో ఉన్న అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించే వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాడుతుందన్నారు. ప్రాజెక్టుల మహాసభ కు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి రామకృష్ణ బండి రామకృష్ణ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీటి రామాంజనేయులు కార్యదర్శి నీళ్లపాళ్ల రామకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాము జిల్లా రైతు సంఘం నాయకులు మధు, చలపతి, గోపాల్, వెంకటరాముడు ప్రసాదు చిన్న కులాయప్ప, చిన్ని కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.