వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసదారులనుద్దేశించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మనం పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదు. మన దేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువగా దృష్టిసారించాలి. అప్పుడే మనకు ఐరోపా లాంటి పరిస్థితి ఉండదు’’ అంటూ ట్రంప్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు ఇప్పటికే ఆయన వెల్లడిరచారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు. జోబైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశంలోకి మూడు లక్షలమంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ విడుదల చేసిన నివేదికలను ఉటంకించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్లు వెల్లడిరచారు. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనను పలు వార్తాసంస్థలు తప్పుబట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దుయ్యబట్టాయి. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ పంచుకుంది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటివారంలో 7,287 మంది పట్టుబడ్డారని వెల్లడిరచింది. అయితే అధ్యక్షుడు పేర్కొన్నట్లు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల అనటం నిజం కాదని.. కేవలం 65శాతం మాత్రమే తగ్గాయని తెలియజేసింది.
అక్రమ వలసదారులతోనే ప్రమాదం: ట్రంప్
RELATED ARTICLES